ఒక వ్యక్తిలో పగ అనే భూతం ప్రవేశించిందంటే దాని పంతం నెరవేర్చుకునే వరకు వదిలి పెట్టదు.ఈ పగ పాముకంటే దారుణంగా ఉంటుంది.
రాక్షసుని కంటే కౄరంగా ఉంటుంది.చివరికి చావడమా, చంపడమా అనేంత వరకు వెళ్లుతుంది.
ప్రస్తుతం ఇలాంటి ఘటనే బెంగళూర్లో వెలుగుచూసింది.ఇక వివరాల్లోకి వెళ్లితే.
తన భర్తతో కలిసి అలీం బీబీ అనే మహిళ బెంగళూర్లోని కుందళహళ్లిలో నివసిస్తున్నారు.ఈ క్రమంలో పొరుగున ఉండే నిందితుడు రఫీకుల్ షేక్తో ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది.
ఈ వివాదం చిలికి చిలికి తుఫానుగా మారగా ఒకగానొక సమయంలో నిందితుడైన రఫీకుల్ షేక్ ను, బీబీ షేక్ను చెప్పుతో కొట్టిందట.ఇది తీవ్ర అవమానంగా భావించిన షేక్ మనసులో పెట్టుకుని సమయం కోసం కాచుకు కూర్చున్నాడట.
కాగా నిన్న ఆదివారం ఒంటరిగా దొరికిన బీబీ షేక్ ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి పరారయ్యాడట.తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే మరణించగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్దలానికి చేరుకుని మృతదేహన్ని మార్చూరికి తరలించి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారట.