నవ సమాజ నిర్మాణ కోసం పాటు పడే వాళ్లే గురువులు.భావిభారత పౌరులకు తీర్చిదిద్దేది వారే.
విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమాజంలో ఆదర్శంగా మెలుగుతారు ఉపాధ్యాయులు.విద్యార్థుల చదువుకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేయాలని తపించేవారు చాలా మంది ఉంటారు.
ఆ కోవకు చెందిన ఉపాధ్యాయురాలే నూర్జహాన్ ఖాతున్.తన పెళ్లి వేదికను రక్తదాన శిబిరంగా మార్చేసింది.పెళ్లికి బంధువులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సాహించింది.
పశ్చిమబెంగాల్ లోని నాడియా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి ముర్షిదాబాద్ కు చెందిన తోటి ఉపాధ్యాయుడు ఓబిదుర్ రెహ్మాన్ కు వివాహం నిశ్చయమైంది.
అయితే పెళ్లి బాజాలు మోగేంతవరకు ఏదైనా మంచి కార్యం చేయాలని భావించింది నూర్జహాన్.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా
బ్లడ్ బ్యాంకుల్లో రక్తపు నిల్వలు
తగ్గిపోయాయి.
రక్తం కొరత ఎక్కువగా ఉందని తెలిసి తన పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.పెళ్లికి వచ్చి బంధువులు, అతిథులు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సాహించింది.
దీంతో పాటు పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసింది.ఈ తంతు ముగిసిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కింది.
రక్తదానం కోసం పుస్తకాలు అందించడంలో ఆమె తండ్రి రుస్తాం అలీషేక్ కూడా సహాయపడ్డారు.పెళ్లికి వచ్చిన అతిథులకు మొక్కలు కూడా పంపిణీ చేశారు.
పెళ్లి వేడుకలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహించిన నూర్జహాన్ ను శభాష్ అంటూ మెచ్చుకున్నారు.