రాజకీయం చేయడంలో అమిత్ షా తర్వాతే ఎవరైనా అంటే అందులో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ రాజనీజ్ఞుడు ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు అమిత్షా.
ఆయన తన రాజకీయ చతురతతో మోడీని రెండు సార్లు అధికారంలోకి తీసుకు రావడంతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చాడు.అద్బుతమైన రాజనీతి వంతుడిగా పేరున్న అమిత్షా దృష్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై పడ్డట్లుగా ఉంది.
బీజేపీని అక్కడ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బ్రహ్మాస్త్రం అన్నట్లుగా గంగూలీని అమిత్ షా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.
గంగూలీని బీసీసీఐ అధ్యక్షుడిగా చేయడం వల్ల ఆ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందడంతో పాటు బీజేపీకి అనుకూలంగా గంగూలీని మల్చుకోవడం జరిగింది.
కోల్కత్తా తో పాటు రాష్ట్రా వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గంగూలీని వచ్చే ఏడాది జరుగబోతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం క్యాండేట్గా గంగూలీని ప్రకటించి ఎన్నికలకు వెళ్లబోతున్నారు.బీజేపీ వ్యూహం ఇదే అయితే ఖచ్చితంగా వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి పరాభవం తప్పదని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.