తెలంగాణ ప్రభుత్వం లే అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బెనిపిట్స్ అందిస్తోంది.అక్రమ లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరటను కలిగించింది.
ఎల్ఆర్ఎస్ ను ప్రకటించింది.దీనికి సంబంధించిన జీవో నంబర్ 131 ను కూడా మంగళవారం ఆమోదం తెలిపింది.
కొంతకాలంగా ప్లాట్ల లే అవుట్ లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిలిపివేసింది.అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను నిర్మూలించేందుకు లే అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ లే అవుట్ రెగ్యూలరైజేషన్ తో ఆదాయం వస్తుందని ప్రభుత్వం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆయా శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది.ఈ సారి ఎల్ఆర్ఎస్ ప్రకారం నిర్మాణం చేపట్టిన భవనాల నుంచి కూల్చడం జరగదు.
దీంతో యజమానులు కొంత డబ్బును చెల్లిస్తే మీ ఇళ్లు సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.అయితే ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా అక్రమ లే అవుట్ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
రాష్ట్రంలో ఉన్న అక్రమ లే అవుట్లను కూల్చివేయాలన్నా ప్రస్తుతం సాధ్యం కానీ పరిస్థితి.కొన్ని చోట్లలో కూల్చివేతలు కొనసాగించినా ముందుకు సాగడం లేదని తెలిసింది.అక్రమ లే అవుట్లలో ఇళ్లు కట్టుకున్న పేదలు, మధ్య తరగతి కుటుంబాలు నష్టపోతాయని భావించి వీటిని క్రమబద్దీకరించేందుకు పూనుకుంది.దీంతో ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యజమానులు తమ నిర్మాణాలను కూల్చుకోలేరని తెలిపింది.