తెలంగాణలో కాస్త తక్కువ అయినా ఏపీలో ఎక్కువ శాతం హోటల్స్ మరియు వివాహాది వేడుకల్లో ఖచ్చితంగా అరటి ఆకులో భోజనం వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం.అరటి ఆకులో భోజనం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉంటారు.
పెద్దలు అనడం మాత్రమే కాకుండా కొందరు శాస్త్రవేత్తలు అరటి ఆకులపై ప్రయోగాలు చేసి పలు అవాక్కయ్యే విషయాలను తెలుసుకున్నారు.అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా అంటూ ప్రతి ఒక్కరు అనుకునే విధంగా ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి.
అరటి ఆకులో భోజనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
ఒకవేళ ఆహారం విషయం అయ్యిందే అనుకోండి అంటే ఎవరైనా కావాలని విషం కలిపినా లేదంటే మరేదైనా కారణం వల్ల ఆహారం విషం అయినట్లయితే ఆ ఆహారంను అరటి ఆకులో వడ్డించిన కొన్ని నిమిషాల్లోనే ఆకు నల్లగా మారడం జరుగుతుంది.ఆకు అలా మారింది అంటే ఆహారంలో విషం ఉందని గుర్తించాలి.అందుకే శత్రువుల ఇంట్లో అయినా అరటి ఆకులో భోజనం పెడితే తినేయొచ్చు అంటారు.
వేడి వేడి అన్నం లేదా మరేదైనా పదార్థం అరటి ఆకుపై వడ్డించిన వెంటనే ఆకుపై ఉండే ఒక పల్చని పొర కరిగి ఆహారం మరింత రుచిగా అయ్యేలా చేస్తుందట.
అరటి ఆకుల్లో భోజనం చేసే వారికి అనారోగ్య సమస్యలు 66 శాతం వరకు తక్కువగా వస్తున్నట్లుగా నిపుణులు నిర్ధారించారు.
అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందట.చిన్నప్పటి నుండి అరటి ఆకులో భోజనం చేసే వారికి తరచు అందరిని వేదించే జబ్బులు రావట.
అరటి ఆకుల్లో భోజనం పెట్టడం వల్ల అన్నదానం సంపూర్ణం అవుతుందట.అన్నదానం పేరుతో పేపర్ ప్లేట్స్ లేదా మరేదైనా ప్లేట్స్లో భోజనం పెట్టడం వల్ల అన్నదానం ఫలం సంపూర్ణంగా దాతకు ద్కదు అంటూ పెద్దలు చెబుతున్నారు.
ఒకప్పుడు అందరు అరటి ఆకుల్లో భోజనం చేసే వారు.కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.ఆంధ్రాలో కూడా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అరటి ఆకు విస్తర్లను వాడుతున్నారు.