చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, గోరువెచ్చని నీళ్ళు తాగాలా లేక చన్నీళ్ళా అని.అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం వేడి లేదా గోరువెచ్చని నీళ్ళు తాగడమే ఆరోగ్యానికి మంచిది అని వేల సంవత్సరాలుగా చెబుతున్నారు.
వేడి నీళ్ళు “అగ్ని” మరియు “కఫా” మధ్య సమతూల్యం తీసుకుకోస్తాయని, తద్వారా ఒంటికి చాలారకాలగా మేలు చేస్తాయని మనం ఈపాటికే చదువుకొని ఉంటాం.మరి వేడి నీళ్లు తాగడం వలన కలిగే లాభాలేంటో చూద్దాం.
* శరీరంలో ఉన్న మలీనాల్ని, టాక్సిన్స్ ని తొలగించడానికి చలినీటి కన్నా బెటర్ గా పనిచేస్తాయి వేడినీరు.కాబట్టి ఉదయాన్ని వేడినీటితో మొదలుపెట్టడం మంచిది.
* భోజనం చేసిన తరువాత గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చిచెప్పాయి.అలాగే బరువు తగ్గవచ్చు.
* గొంతు నొప్పితో బాధపడేవారు ఉదయాన్నే, మళ్ళీ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగితే మంచిది.గొంతునోప్పితో పాటు గొంతు గరగర నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు.
* ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
* గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా శరీరంలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది.
కాబట్టి పీరియడ్స్ లో నొప్పులతో బాధపడేవారు ఉదయాన్ని వేడినీరు తాగడం ద్వారా మొదలుపెట్టడం మర్చిపోవద్దు.