అల్లుడు శీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూడు సంవత్సరాలు వరుసగా చేసిన సినిమాలు ఏవీ కూడా సక్సెస్ను తెచ్చి పెట్టలేదు.ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతూ వచ్చింది.
అలాంటి సమయంలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ చేశాడు.ఆ చిత్రంకు మంచి స్పందన దక్కింది.
బెల్లంకొండ కెరీర్లో మొదటి సక్సెస్ అందుకున్నాడు.తక్కువ బడ్జెట్తో తీయడం వల్ల ఆ సినిమా నిర్మాతకు భారీగా లాభాలు కూడా చేకూరినట్లుగా సమాచారం అందుతోంది.
బెల్లంకొండ ‘రాక్షసుడు’ చిత్రం తర్వాత తన పద్దతిని మార్చుకున్నాడు.సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అసలు సినిమాలు భారీ బడ్జెట్తో కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే తప్పకుండా వసూళ్లు నమోదు అవ్వడంతో పాటు, సక్సెస్లు కూడా వస్తాయని నమ్ముతున్నాడు.అందుకే ఇకపై వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను చేయాలని నిర్ణయించుకున్నాడు.
బెల్లంకొండ తదుపరి చిత్రం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఈయన యూత్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయడంలో దిట్ట అని ఆయన గత చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది.
ఈసారి బెల్లంకొండతో త్రినాధరావు ఒక పూర్తి కామెడీ సినిమాను ప్లాన్ చేశాడట.లవ్ కమ్ కామెడీ నేపథ్యంలో సినిమా రూపొందుతుందని చిత్ర యూనిట్ ద్వారా సమాచారం అందుతోంది.
ఇంకా చర్చల దశలో ఉన్న ఈ చిత్రంను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.