తమిళ్ స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా కర్ణన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.నిజ జీవిత సంఘటనలని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించారు.
ఇక థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.అయితే కరోనా సెకండ్ వేవ్ సినిమాకి కొంత ఇబ్బందికరంగా మారింది.
అయినా కూడా కలెక్షన్స్ భాగానే వచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కోసం టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు పోటీ పడినట్లు తెలుస్తుంది.
ఫైనల్ గా బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమా రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.భారీ ధర చెల్లించి ఈ రీమేక్ రైట్స్ ని బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాని తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి రీమేక్ చేయడం కోసమే వాటిని సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.బెల్లంకొండ శ్రీనివాస్ కి తమిళ్ హిట్ మూవీ రీమేక్ గా వచ్చిన రాక్షసుడు సినిమాతో కెరియర్ లో ఫస్ట్ సూపర్ హిట్ వచ్చింది.
ఈ నేపధ్యంలో కర్ణన్ మూవీ అయితే మరో హిట్ తన కొడుకు ఖాతాలో పడుతుందని నిర్మాత సురేష్ ఆలోచించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో వివి వినాయక్ బాలీవుడ్ లోకి దర్శకుడుగా అడుగుపెడుతున్నారు.చత్రపతి రీమేక్ కంప్లీట్ అయిన తర్వాత బెల్లంకొండ సురేష్ కొడుకుతో కర్ణన్ రీమేక్ ని తెలుగు, హిందీ బాషలలో స్టార్ట్ చేసే అవకాశం ఉందని బోగట్టా.