టాలీవుడ్ లో వరుస కమర్షియల్ సినిమాతో మాస్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.ఫ్లాప్, హిట్స్ తో సంబంధం లేకుండా వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలు చేసిన బెల్లకొండ హీరోగా రాక్షసుడు సినిమాతో సాలిడ్ సక్సెస్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా వెంటనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమాతో కమర్షియల్ కామెడీ పండించడానికి రెడీ అయిపోయాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది.షూటింగ్ లు ప్రారంభం కాగానే మరల దీనిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాని సుదీర్ వర్మ తన స్టైల్ లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లు బోగట్టా.