యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు చేసిన బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి కొత్త దర్శకులని ఫైనల్ చేసుకుంటుంది.కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వారు చెబుతున్న కథలు వింటున్న యూవీ క్రియేషన్స్ హీరోలని కూడా లైన్ లోకి తీసుకుంటుంది.
అందులో భాగంగా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతుంది.ప్రస్తుతం చత్రపతి సినిమా కోసం ముంబైలో మకాం వేసిన బెల్లంబాబుని లైన్ లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
కొత్త దర్శకుడు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు రీసెంట్ గా ముంబై వెళ్లి బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో కథ నచ్చడంతో సినిమా చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఒకే చెప్పాడని బోగట్ట.
అయితే యూవీ క్రియేషన్స్ అయినా సరే కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయంలో తండ్రి బెల్లంకొండ సురేష్ లైన్ లోకి వస్తాడు.సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని కండిషన్ పెడతాడు.
రెమ్యునరేషన్ తక్కువైన పర్లేదు కాని బడ్జెట్ తక్కువ కాకూడదనే ఫిలాసఫీతో సురేష్ తన కొడుకుని కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో శ్రీరామ్ చెప్పిన కమర్షియల్ స్టొరీ లైన్ నచ్చడంతో తాజాగా యూవీ నిర్మాతలు ఓపెనింగ్ కూడా చేసేశారు.
త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.యూవీ క్రియేషన్స్ లాంటి మంచి బ్రాండ్ ఉన్న నిర్మాతలతో ఇన్ని ఫ్లాప్ ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ని సినిమా చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.