యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటి కావడంతో పాటు నటుడిగా ప్రభాస్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.దాదాపు 16 సంవత్సరాల తరువాత ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా జయంతి లాల్ గడ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్టార్ట్ కాగా అల్లుడు అదుర్స్ సినిమా రిజల్ట్ వల్ల ఛత్రపతి రీమేక్ పనులు తాత్కాలికంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది.
తెలుగులో సంక్రాంతి పండుగకు విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
పండుగకు విడుదలైన ఇతర సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అల్లుడు అదుర్స్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు.దీంతో ఛత్రపతి రీమేక్ లో యాక్షన్ డోస్ ను తగ్గించి కథలో మార్పులు చేయాలని బాలీవుడ్ మూవీ మేకర్స్ వినాయక్ కు చెప్పారని.ఈ మేరకు స్క్రిప్ట్ లో మార్పులు జరిగాయని తెలుస్తోంది.
గతంలో వీవీ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల్లుడు శ్రీను సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
వినాయక్ సపోర్ట్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.