టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.“అల్లుడు శీను” సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించి ఈ సినిమాతో పర్వాలేదు అనిపించినా సూపర్ హిట్ అయితే అవ్వలేదు.
ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం ఫిట్ గా కండలు తిరిగిన బాడీతో తనను తాను రెడీ చేసుకుని షూటింగ్ లో అడుగు పెట్టాడు.
తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి‘ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాతోనే వినాయక్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ఆంధ్ర ప్రదేశ్ లోని భీమిలి బీచ్ లో చేస్తున్నారు.
ఇక్కడే వారం రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్టు డైరెక్టర్ వీవీ వినాయక్ తెలిపారు.ఈ షూటింగ్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భీమిలి బీచ్ లో చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది.
ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో ఛత్రపతి టీమ్ ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలిసి మాట్లాడారు.ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.వినాయక్ తనకు మంచి స్నేహితుడు అని, స్వయం కృషితో గొప్ప దర్శకుడిగా ఎదిగారని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలిపారు.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పుకొచ్చారు.