బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా జరిగిపోయింది.
ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది.లాక్ డౌన్, కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.
బాలయ్య ఈ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే బోయపాటి ప్రకటించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ గట్టిగా వినిపిస్తుంది.
ఈ సినిమాలో వరుస కమర్షియల్ సినిమాలతో సోలో హీరోగా దూసుకుపోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక సన్నివేశాలలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడని, అతని మీద ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ విషయాన్ని సినిమా రిలీజ్ వరకు గోప్యంగా ఉంచాలని బోయపాటి అనుకుంటున్నట్లు తెలుస్తుంది.బెల్లంకొండ శ్రీనివాస్ ని జయ జానకి నాయక రూపంలో బోయపాటి సాలిడ్ హిట్ ఇచ్చాడు.
ఆ సినిమా నిర్మాతగా వ్యవహరించిన మిర్యాల రవీంద్రబాబు బాలకృష్ణ సినిమాకి కూడా నిర్మాతగా ఉన్నాడు.ఈ నేపధ్యంలోనే తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శక, నిర్మాతలు అడగడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కాదనలేక చేయడానికి ఒకే చెప్పటానికి తెలుస్తుంది.
అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాల్సిందే.