తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారిలో పెద్ద కుర్రాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో కూడా అప్పుడే నటించాడు.
మాస్ ఆడియన్స్లో మంచి గుర్తింపును దక్కించుకున్న శ్రీనివాస్ తాజాగా రాక్షసుడు చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్నాడు.త్వరలోనే ఈయన తన తమ్ముడిని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బెల్లంకొండ వారి చిన్నబ్బాయి సాయి గణేష్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.గతంలో చాలా లావుగా ఉండే గణేష్ ఇప్పుడు చాలా సన్నగా అయ్యాడు.సినిమాల్లో నటించడం కోసం గత రెండేళ్లుగా నటన మరియు డాన్స్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు.నాన్న సురేష్కు ఉన్న పరిచయాలతో గణేష్కు కూడా ఈజీగానే ఇండస్ట్రీకి ఎంట్రీ దక్కే అవకాశం ఉంది.
కాని సక్సెస్ల విషయంలో అన్న శ్రీనివాస్లాగే ఈయన ఎదురు చూడాల్సి వస్తుందా లేదంటే వెంటనే దక్కుతుందా అనేది వేచి చూడాలి.
ఇక శ్రీనివాస్ మొదటి నుండి కూడా భారీ బడ్జెట్ చిత్రాలు చేశాడు.కొత్త హీరోలకు అంత బడ్జెట్ ఏంటీ అంటూ అంతా ఆశ్చర్యపోయే విధంగా సాయి శ్రీనివాస్ సినిమాలు తెరకెక్కాయి.తెర వెనుక సురేష్ ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఇతర నిర్మాతలతో సినిమాను చేయించేవాడు.
ఇక చిన్న కొడుకు గణేష్ విషయంలో కూడా బెల్లంకొండ సురేష్ అదే విధంగా చేస్తాడేమో చూడాలి.ఇండస్ట్రీలో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం చాలా కామన్గా చూస్తేనే ఉన్నాం.
కాని ఇద్దరిలో ఒక్కరు మాత్రమే సక్సెస్లు అవుతున్నారు.మరి ఆ సక్సెస్లు ఎవరికి దక్కేనో చూడాలి.