టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసి అదిరిపోయే హిట్ అందుకునేందుకు బెల్లంకొండ బాబు ప్లాన్ చేశాడు.
ఇక ఈ సినిమాను కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు మిక్సిడ్ టాక్ రావడం, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తుంది.
కాగా ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సినిమా రిజల్ట్తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా రిజల్ట్ను పట్టించుకోకుండా తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ఈ హీరో.
కాగా ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు.
దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అల్లుడు అదుర్స్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకుందామని చూసినా, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు ఈ హీరో.
ఇక బాలీవుడ్లో ఛత్రపతి చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది.
మరి ఈ సినిమాతో బెల్లంకొండ బాబు బాలీవుడ్లో ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక అల్లుడు అదుర్స్ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అందాల భామ నభా నటేష్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.