టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.భారీ బడ్జెట్ చిత్రాలను సైతం తెరకెక్కించిన ఈ హీరో ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
‘రాక్షసుడు’ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక గతంతో కందిరీగ లాంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో రానున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రం కథ చాలా పాతదని తెలుస్తోంది.
ఈ సినిమా కథ కందిరీగ చిత్రాన్ని పోలి ఉంటుందని తెలుస్తోంది.ఇందులో హీరో పాత్ర చాలా యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్గా ఉండనుందట.ఇక కందిరీగ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, ఇప్పుడు అల్లుడు అదుర్స్లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట.కమర్షియల్ అంశాలను ఈ సినిమాలో పుష్కలంగా పెడుతున్నాడట డైరెక్టర్.
కాగా ఈ సినిమా కోసం బెల్లంకొండ బాబు చాలా కొత్త లుక్లోకి మారిపోయాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్లు నటిస్తున్నారు.సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి కందిరీగ లాంటి హిట్ అందుకోవాలని చూస్తుండగా, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాగైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.మరి ఈ పాత కథను ప్రేక్షకులు మెచ్చే విధంగా కొత్తగా ఎలా చూపించబోతున్నారు అనేది చూడాలి.