టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్కు వెళ్లడంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.ప్రభాస్ సూపర్ హిట్ మూవీ చత్రపతిని హిందీలో రీమేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.
ఈ రీమేక్కు సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సారా అలీ ఖాన్ మరియు అనన్య పాండే లు హీరోయిన్స్ గా నటించబోతున్నారట.
తెలుగులో ఇంకా పూర్తి స్తాయిలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు దక్కించుకోలేక పోయిన బెల్లంకొండ అప్పుడే బాలీవుడ్కు వెళ్లడం అవసరమా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తుండగా టాలీవుడ్ లో ఫలితాలతో సంబంధం లేకుండా నిరభ్యంతరంగా బాలీవుడ్ కు వెళ్లవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు తన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్ లతో నచ్చాడు.
కనుక అక్కడ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం వల్ల నష్టం ఏమీ ఉండదని, అదృష్టం బాగుంటే అక్కడ సక్సెస్ అయ్యి బాలీవుడ్ హీరోగా సెటిల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అన్నాడు.
వరుసగా హిందీలో సినిమాలు చేసి సక్సెస్ దక్కించుకుంటే సౌత్ నుండి బాలీవుడ్ లో స్టార్ అయిన హీరోగా బెల్లంకొండ అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది.బెల్లంకొండ ఒక వేళ హిందీలో సక్సెస్ కాకున్నా కూడా పోయేది ఏమీ లేదు.వీలు ఉంటే మరోటి అక్కడ చేస్తాడు లేదంటే తెలుగులోనే మరిన్ని సినిమాలు వరుసగా చేసే అవకాశం ఉంది.
కనుక బెల్లంకొండ ఇప్పుడు అప్పుడు అనే తేడా లేకుండా ఎప్పుడైనా హిందీలో ఎంట్రీ ఇవ్వొచ్చు అంటున్నారు.తెలుగులో ఈయన అల్లుడు అదుర్స్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా తర్వాత రీమేక్ పనులు మొదలు అయ్యే అవకాశం ఉంది.