బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్ ను ఒక లెవెల్లో తీసుకెళుతున్నాడు.తండ్రి బెల్లంకొండ సురేష్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ కొడుకు సినిమాలను బాగానే లేపుతున్నాడు.
కానీ సినిమాలు మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు.
అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు 6 సినిమాలు రిలీజ్ చేశాడు.ఈ వారం రాక్షసుడు అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ కలుగుతోంది.
తమిళ్ ఫిల్మ్ రాట్ససన్ కి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
బెల్లకొండ వారసుడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.ఇకపోతే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బాగానే ఉంది.విడుదలకు ముందే హిందీ బ్రాడ్ క్యాస్ట్ డబ్బింగ్ రైట్స్ ద్వారా 12 కోట్లు అందాయి.తెలుగు బ్రాడ్ క్యాస్ట్ రైట్స్ 6కోట్లు.ఈ విధంగా సినిమా మంచి లాబాలనే అందించింది.సినిమా సక్సెస్ అవ్వాలంటే తెలుగులో 20కోట్లను కలెక్ట్ చేయాలి.
మరి విడుదల తరువాత రాక్షసుడు ఏ స్థాయిలో లబాల్ని అందిస్తాడో చూడాలి.
తాజా వార్తలు