టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన దూకుడును బాక్సాఫీస్కు మరోసారి చూపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.ఆయన నటించిన లాస్ట్ మూవీ అల్లుడు అదుర్స్బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.
అంతేగాక టైమ్ తీసుకుని మరీ కథలను ఓకే చేస్తూ వస్తున్నాడు.అయితే తన నెక్ట్స్ మూవీతో బెల్లంకొండ బాబు ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు.
టాలీవుడ్లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ఛత్రపతిచిత్రాన్ని హిందీలో బాబు హీరోగా చేస్తున్నాడు.
ఈ సినిమాకు తెలుగు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
దీంతో ఈ సినిమా బాలీవుడ్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని సినీ క్రిటిక్స్ అప్పుడే లెక్కలు కూడా వేస్తున్నారు.అయితే ఈ సినిమాతో పాటు తెలుగులో మరో రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సాయి శ్రీనివాస్ రెడీ అయ్యాడు.
తమిళంలో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్గా నిలిచిన కర్ణన్చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యాడు.ఈ సినిమా షూటింగ్ను కూడా త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చాడు.దీంతో ఆయన ప్రస్తుతం హిందీ ఛత్రపతి చిత్రం కంటే కూడా కర్ణన్ తెలుగు రీమేక్ను ముందుగా ప్రారంభించాలని చూస్తున్నాడు.
కర్ణన్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని బాబు ఆలోచిస్తున్నాడట.ఛత్రపతి చిత్రాన్ని వాయిదా వేసి, కర్ణన్ చిత్ర రీమేక్ తరువాత ఆ సినిమాను చేయాలని ఆయన భావిస్తున్నాడు.
దీంతో ఛత్రపతి హిందీ రీమేక్ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే బాబు స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.