ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా “అల్లుడు శీను” చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాతోనే ఎంతో ఘన విజయాన్ని సంపాదించుకున్నాడు.ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందడంతో వరుస సినిమాలలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్ళించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రాలు హిందీలో డబ్ కూడా కావడంతో అక్కడ కూడా మంచి ఆదరణ లభించడంతో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయం అని బెల్లంకొండ ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఆరు సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో యూట్యూబ్ లో 200 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించాయని తెలిపారు.
ఈ సినిమాల ద్వారా ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ప్రజలు నన్ను గుర్తించడంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి కరెక్ట్ సమయం అని తెలిపారు.అయితే దశాబ్దం క్రితం తెలుగులో ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో ప్రభాస్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఒరిజినల్ వెర్షన్ లో ప్రభాస్ పాత్రలో నటించడానికి నాకు భయం లేదంటూ ఆయన తెలిపారు.అంతే కాకుండా బాలీవుడ్ ప్రజలు ఎక్కువ మంది ఒరిజినల్ వెర్షన్ చిత్రాన్ని చూడకపోవడం ఒక ప్లస్ పాయింట్ అవుతుందని భావించారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా స్క్రిప్టులో కొంత మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.వెండితెరకు అల్లుడు శీను సినిమా ద్వారా పరిచయం చేసిన దర్శకుడు వివి వినాయక్ ప్రస్తుతం ఛత్రపతి సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల్లుడు అదుర్స్” చిత్రంలో నటించనున్నారు.ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అను ఇమ్మానియేల్, నభా నటేష్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత బాలీవుడ్ చిత్రంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.