బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.స్వాతిముత్యం సినిమా బెల్లంకొండ సాయి గణేష్ కి మొదటి సినిమా అయినా కూడా చిరంజీవి మరియు నాగార్జున లకు పోటీ అన్నట్లుగా గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్ సినిమాలు విడుదల అవుతున్న రోజే ఈ సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు.
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడం చాలా అరుదైన విషయం.ఈ మధ్య కాలంలో ఇలా జరగడం దాదాపుగా చూసి ఉండరు.
కానీ గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అంతా చర్చ జరుగుతోంది.
ఈ సమయంలోనే స్వాతిముత్యం సినిమాను ప్రేక్షకుల ముందుకు అదే తేదీన తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు.
నిన్న మొన్నటి వరకు సినిమా విడుదల వాయిదా పడుతుందని అంతా భావించారు.కానీ ప్రమోషన్ కార్యక్రమాలు ఆ సినిమాల స్థాయిలోనే జరుగుతున్నాయి కనుక విడుదల వాయిదా అనేది కచ్చితంగా లేదని చెప్పాలి.
తాజాగా చిత్ర నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.సినిమా చిన్నది కావచ్చు, హీరో కొత్త వాడు కావచ్చు.మా బ్యానర్ గురించి మీకు అందరికీ తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ చాలా పెద్ద బ్యానర్ కనుక ఈ సినిమా ను పెద్ద సినిమాల రేంజ్ లోనే విడుదల చేయబోతున్నాం.
అందువల్ల సినిమా తప్పకుండా మంచి వసూళ్లను నమోదు చేస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.పెద్ద హీరోలకు పోటీగా సినిమాను విడుదల చేయడం అంటేనే చాలా పెద్ద విషయం, అలాంటిది ఆ సినిమాలకు పోటీగా మా సినిమా కూడా కలెక్షన్స్ ని రాబడుతుంది అంటూ బెల్లంకొండ సాయి గణేష్ స్వాతిముత్యం చిత్ర నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.రూ.10 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్వాతిముత్యం సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ రీచ్ అవుతుందని నమ్మకమును ఆయన వ్యక్తం చేస్తున్నాడు.ఆయన నమ్మకాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.మరి స్వాతిముత్యం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.