బ్రెజిల్ లోని ఒక బార్ లో కాల్పుల మోత మోగింది.బ్రెజిల్ లోని పారా రాష్ట్రం లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
కార్లు,బైక్ లపై వచ్చిన ఏడుగురు దుండగులు బెలెమ్ నగరంలోని ఒక బార్ లోకి ప్రవేశించి బార్ లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు తెలుస్తుంది.దీనితో ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా కొందరు గాయపడినట్లు సమాచారం.
అయితే వెంటనే సమాచార అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే సరికే ఆ దుండగులు పారిపోయినట్లు తెలుస్తుంది.
కానీ దుండగులలో ఒకరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.అయితే ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు,ఐదుగురు పురుషులు మృతి చెందినట్లు అధికారులు స్ఫష్టం చేశారు.
మొత్తం ఏడుగురు దుండగులు ఈ ఘటనలో పాల్గొనగా ఒకరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోగా,మిగిలిన ఆరుగురు పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే అసలు వారు ఈ విధంగా బార్ లో ఎందుకు కాల్పులకు పాలపడ్డారు,ఈ దాడి వెనుక కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు.మరోపక్క ఈ ఘటన తో బ్రెజిల్ నగరం ఉలిక్కిపడింది.