బెజవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ వరుస విజయాలు దక్కించుకుంది.2014లో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ విజయం సాధించారు.ఇక, గత ఏడాది ఎన్నికల్లోనూ ఆయన జగన్ సునామీని తట్టుకుని ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు.ఇంతవరకు బాగానే ఉంది.అయితే.నియోజకవర్గంలో ఆయనకు ఏడాది కిందట ఉన్న హవా.
ఇప్పుడు పార్టీలోనే కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.గతంలో గద్దెకు కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంకు అండగా ఉంది.
కీలకమైన నాయకులు ఆయనకు అండగా నిలిచారు.అయితే.
ఇక్కడ రెండో సారి విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం మారేసరికి.తనకెందుకులే అని ఆయన అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేశారు. సహజంగానే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు ఏ ప్రభుత్వం కూడా సహకరించదు.గతంలో వైసీపీ నాయకులు గెలిచిన నియోజకవర్గా ల్లో చంద్రబాబు కూడా నిధులు ఇవ్వలేదు.అయితే.ఈ విషయంలో వైసీపీ నాయకులు పోరాడి సంపాయించుకున్నారు.
ఇక, తూర్పు నియోజకవర్గంలో గద్దె మాత్రం ప్రభుత్వంపై పన్నెత్తు మాట అనడం లేదు.పోనీ నిధులు తీసుకువచ్చి నియోజకవర్గా న్ని అభివృద్ధి చేస్తున్నారా? అంటే.అది కూడాలేదు.పోనీ.తన నియోజకవర్గం పరిధిలో ఉన్న బెంజిసర్కిల్ వద్ద ఫ్లైవోవర్ నిర్మా ణాన్ని, బెజవాడ-బందరు రోడ్డు విస్తరణ పనులను కూడా ఆయన తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేక పోతున్నారు.
దీనికి కారణం.ఎంపీ కేశినేని నాని.ఆయన తెల్లారిలేస్తే.ఇవన్నీ తనే డెవలప్ చేశానని.తను చేసిన పోరాటం వల్లే బెజవాడ బందరు రోడ్లు ఆరు లైన్లు అభివృద్ధి అవుతోందని, బెంజిసర్కిల్ ఫ్లైవోవర్ వచ్చిందని చెబుతున్నారు.దీంతో గద్దె ఏం చేశారని ప్రశ్నిస్తే.నీళ్లు నమిలే సమాధానమే వస్తోంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా ఏమీ చేయలేదు.ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అస్సలు ప్రజలకే దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఉంటే.సతీసమేతంగా మీడి యా ముందుకు వచ్చి.అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.పార్టీ కార్యక్రమాలకు కూడా అయిష్టంగానే హాజరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఒక్క రాజధాని అమరావతి ఉద్యమం కోసంమాత్రమే భార్యాభర్తలు ఉద్యమిస్తున్నారు.దీనివల్ల విజయవాడ తన నియోజకవర్గంలో ఏంటి ప్రయోజనం అంటున్నారు ప్రజలు, దీంతో నాయకులు, కేడర్ కూడా పార్టీకి, గద్దె కుటుంబానికి దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.