తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా ఇతర భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు రాయ్ లక్ష్మీ.తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా రాయ్ లక్ష్మీ గుర్తింపును సంపాదించుకున్నారు.
స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించిన రాయ్ లక్ష్మీ ఆ సాంగ్స్ ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యారు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మీ తండ్రి మరణంతో కుంగిపోయానంటూ కీలక విషయాలను వెల్లడించారు.
గతేడాది విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల తనకు ఎదురైన పరిస్థితుల గురించి రాయ్ లక్ష్మీ చెప్పుకొచ్చారు.జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని నోటి క్యాన్సర్ వల్ల తన తండ్రి గతేడాది కన్ను మూశాడని రాయ్ లక్ష్మీ అన్నారు.
నాన్న మరణం తర్వాత జీవితం వెలితిగా అనిపించడంతో పాటు కుంగిపోయానని తెలిపారు.కొత్త సంవత్సరం వేడుకల సమయంలో తనకు దుబాయ్ లో ఒక ప్రోగ్రామ్ చేసే ఆఫర్ లభించిందని ఆమె అన్నారు.
అయితే కొత్త సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అన్నారు.మొదట నీరసం, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని.
హోం క్వారంటైన్ లో ఉండటం ఎంతో కష్టమని రాయ్ లక్ష్మీ తెలిపారు.దుబాయ్ లో తనకు ఎవరూ తెలియదని.
ఒక రూమ్ లో ఐసోలేషన్ లో తాను ఉన్నానని ఆమె అన్నారు.కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో మరింత కుంగిపోయాయని తెలిపారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తాను పరీక్షలు చేయించుకునేదానినని అలా పరీక్షలు చేయించుకున్న 12 రోజుల తర్వాత నెగిటివ్ గా తేలిందని తెలిపారు.శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా లక్ష్మీరాయ్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు.సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.