పూజా హెగ్డే.ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించి హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఈమె ఒకరు.
అక్కినేని నాగ చైతన్యతో ఒక లైలా కోసం అంటూ నటించిన ఈమె మొదటి సినిమా సక్సెస్ అవ్వలేదు.ఆతర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం అంటూ ఓ సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమాలో కూడా పెద్దగా పేరు సంపాదించలేదు.
అలంటి ఈ నటి మొదట్లో అన్ని ప్లాప్ లు ఉన్న కూడా ఇప్పుడు గోల్డెన్ లెగ్ లాగా తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది.
ఇక ఇప్పటికే అరవింద సమేత, అలా వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు మరికొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.అయితే ఇలా సినిమాల పరంగా గోల్డెన్ లెగ్ అయినప్పటికీ.సోషల్ మీడియా ద్వారా మాత్రం కాంట్రావర్సీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇకపోతే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మరికొన్ని హాట్ కామెంట్స్ పూజా హెగ్డే చేసింది.ఆ కామెంట్స్ ఏంటంటే.
ఆ హాట్ కామెంట్స్ కాంట్రావర్సీ అయితే కాదు కానీ ప్రతి రోజు కెమెరా ముందు ఉండడం కూడా అదృష్టమే అని అంటుంది ఈ భామ.అదృష్టం అంటే ఏంటి అని ప్రశ్న వెయ్యగా.అదృష్టం ఊరికే రాదు.ఎవరైతే కష్టపడి పని చేస్తారో అలాంటి వారిని అదృష్టం వరిస్తుంది.నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం తలుపుతడుతుంది.ఇంకా సినీ రంగంలో ఉండాలంటే ఎంతో కష్టపడాలి.
ఓపికగా ఉండాలి.కష్టం లేకుంటే ఎదగడం కష్టం అని చెప్పగా.
సినిమాలు చెయ్యడం.ప్రతి రోజు కెమెరా ముందు ఉండటానికి మించిన అదృష్టం మరొకటి ఉండదని చెప్పుకొచ్చింది ఈ నటి.ప్రస్తుతం ఈమె అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.