సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.
దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.
అయితే ఈ ప్రొమోషన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ మెహ్రీన్, డైరెక్టర్ అనిల్ కూడా పాల్గొంటున్నాడు.
అయితే తమన్నా మాత్రం ఇంత వరకు ఏ ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు.
దీంతో ఈమెకు ఎఫ్ 3 టీమ్ తో చెడింది అంటూ ఊహాగానాలు వచ్చాయి.అయితే అసలు విషయం ఇది కాదట.
కేన్స్ 2022 వేడుకలు అట్టహాసంగా జరిగాయి.ఇందులో మిల్కీ బ్యూటీ మెరుపులు కేన్స్ ఉత్సవాల్లో హైలెట్ గా నిలిచాయి.
ఎంత మంది ఉన్న పాలమీగడ లాంటి ఈ భామ అందాలు అక్కడి వారికీ కనువిందు చేసాయి.
వీటి కారణంగానే ఈమె ఎఫ్ 3 ప్రొమోషన్స్ లో పాల్గొనలేదట.ఈమె ఈ ఉత్సవాలు ముగిసే వరకు ఈమె ఉండాలని ముందుగానే అగ్రిమెంట్ రాసుకున్నారట.ఈమె కేన్స్ ఉత్సవాలకు స్పాన్సర్ గా వెళ్ళింది.
అందుకు ఈమెకు భారీ పారితోషికం కూడా అందించారు.ఈ కారణంగానే ఈమె కేన్స్ ఉత్సవాలు ముగిసే వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఇక తమన్నా ఇండియాకి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది.మరి ఇప్పుడైనా ఈ అమ్మడు ఎఫ్ 3 ప్రొమోషన్స్ లో పాల్గొని ఈ ఊహాగానాలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.