చదువు కొని నెలా నెలా ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.వేలకు వేలు సంపాదిస్తున్నా ఆలయాలకు విరాళాలు ఇవ్వడానికి ఎంతో ఆలోంచించే వారు చాలా మందే ఉన్నారు.
కానీ ఒక బిచ్చగాడు మాత్రం తాను సంపాదించిన ఒక్కో రూపాయిని దాచి పెట్టి మరీ ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చి తన మనసును చాటుకున్నాడు.శ్రీకాకుళం జిల్లా లో నివసించే ఒక బిచ్చగాడు ఈ విధంగా ఆలయ అభివృద్ధి కి విరాళం అందించాడు.
చేబోలు కామరాజు అనే వ్యక్తి అరవై ఏళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేద్దామని విజయనగరం జిల్లా చీపురు పల్లికి వచ్చారు.అయితే అక్కడే స్థిరపడి పోయిన ఆయన కాళ్లు అనుకోకుండా చచ్చుపడిపోయాయి.
దీనితో అతని కుటుంబానికి కూడా దూరమయ్యాడు.ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెందిన ఆయన తన తదుపరి జీవితం దేవుడి సన్నిధి లోనే గడపాలని భావించి ఆలయం ముందు యాచించడం మొదలు పెట్టాడు.
భక్తులు వేసే చిల్లర నాణేలను కూడబెట్టి రూ.3 లక్షల ఐదు వేల రూపాయిలను ఏ గుడి అయితే తనకు ఆశ్రయం కల్పించిందో ఆ గుడి అభివద్ధికే విరాళంగా అందజేసి అందరి మెప్పు పొందాడు.ఆ ఒక్క ఆలయం కే కాకుండా ఇటీవల ఆ పట్టణం లోని రావివలస కూడలి సమీపంలో ఉన్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం భక్తుల సౌకర్యార్ధం షెడ్డు నిర్మాణానికి కూడా 30వేల రూపాయలు అందించినట్లు తెలుస్తుంది.నిజంగా బిచ్చమెత్తుకుంటున్న ఒక వ్యక్తి ఈ విధంగా దేవాలయాలకి విరాళాలు అందించి ఆ పట్టణం లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు.
తాజా వార్తలు