మనం బయటకు వెళ్ళినప్పుడు మన వెంట బిచ్చగాళ్ళు, హిజ్రాలు మనల్ని బిచ్చం అడుగుతుండడం గమనించే ఉంటాం.మన దగ్గర ఉంటే ఇస్తాం లేదంటే లేదు అని చెప్పి పంపిస్తాము.
అయితే కొందరు మనల్ని కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు.కానీ బెంగుళూరులో ఒక వ్యక్తికి విచిత్ర సంఘటన ఎదురైంది.
అచ్చం సినిమాల్లో లాగా బిచ్చం వేయకుంటే ఏకంగా చితకబాదారు.
బాధితుడు తెలిపిన వివరాల మేరకు….
బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిప్రతి రోజు ఉదయం వాకింగ్ కి వెళ్ళేవాడు.ఇక అలా వెళ్లిన అతను తనతో పాటు పర్సు గాని, డబ్బులు గాని తీసుకు వెళ్లే అలవాటు అతనికి లేదు కేవలం పది రూపాయలు మాత్రమే తన వెంట పేపర్ కోసం తీసుకు వెళ్లేవాడు.
అయితే ఆ రోజు ఉదయం వాకింగ్ పెళ్లి ఐదు రూపాయలు పెట్టి పేపర్ కొని తిరిగి ఇంటికి వస్తుండగా ఆటో లో నుంచి ఒక హిజ్రా దిగి డబ్బులు కావాలని అతనిని అడిగింది.
అయితే తన దగ్గర కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పగా ఆమె ఏమాత్రం వినకపోవడంతో పది రూపాయలు కావాలని గొడవ చేసింది.
ఎంత చెప్పినా వినకుండా చాలాసేపు విసిగించారు.చివరికి హిజ్రా డబ్బులు ఇవ్వలేదు అనే కోపంతో చెప్పు తీసుకుని తన మీద దాడి చేసింది.ఆ వ్యక్తి హిజ్రాను పక్కకు తోసేసి అక్కడి నుంచి పరుగులు పెట్టగా ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని పట్టుకుని చితకబాదారు.
అతనికి చేయి విరిగిందని తెలియడంతో అక్కడ నుంచి ఆ ముగ్గురు పారిపోయారు.
గాయాలతో అతను ఇంటికి వెళ్లి కొడుకుతో పాటు పోలీసులను ఆశ్రయించాడు.స్థానికుల సహాయంతో అతను ఆ ముగ్గురు వ్యక్తుల ఆచూకీ కోసం వెతికి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిజ్రా నిజంగా డబ్బు కోసమే అలా కొట్టించిందా లేక ఎవరైనా ప్లాన్ ప్రకారం అలా చేసారా అని ఆరా తీస్తున్నారు.