సూపర్ స్టార్ రజినీకాంత్ – సంచనాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఎంథీరన్ (తెలుగులో రోబో) ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మీకు ఇంకా గుర్తుకు ఉండే ఉంటుంది.ఖలేజా డిజాస్టర్ అయినా, బృందావనం లాంటి హిట్ సినిమాని పక్కన పెట్టుకొని ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అప్పట్లో రోబో.అందువలనే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 2.0 ని 90 కోట్లకు పైగా చెల్లించి కొంటున్నారు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్.ఇంత బిజినెస్ జరగడానికి శంకర్ తో పాటు రజినీకాంత్ కూడా కారణం.కాని ఈ క్రేజీ సీక్వెల్ తిరిగి రజినీకాంత్ కి రాకముందు మరో హీరో చేతిలో పడిందని చెబితే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, ఎందుకంటే స్వయంగా ఆ హీరోనే ఈ విషయాన్ని బయటపెట్టాడు.
అంత పెద్ద హీరో ఎవరబ్బా అని మీరు ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు.అంత మార్కెట్ ఎవరికీ ఉంది, ఆమీర్ ఖాన్ కి తప్ప.అవును, 2.0 కోసం ఆమీర్ ఖాన్ ని సంప్రదించారట శంకర్.రజిని కూడా ఆమీర్ ని ఈ సినిమా చేయమని కోరారట.అందుకు కారణం అప్పుడు రజినీ ఆరోగ్యం బాగాలేకపోవడమే.2.0 బడ్జెట్ ఏకంగా 350 కోట్లు.అంత బడ్జెట్ ని రికవర్ సులువుగా చేయాలంటే అది ఆమీర్ వల్లే అవుతుంది.ఎందుకంటే గ్రాఫీక్ సినిమాలు తీయకపోయినా, ఆమీర్ మార్కెట్ 2000 కోట్లు.కాని 2.0 సినిమా చేయలేనని చెప్పేసాడు ఆమీర్.
“రజినీకాంత్ తప్ప ఈ సినిమా ఇంకెవరు చేయకూడదు, నన్ను నేను చిట్టి లాగా, ప్రొఫెసర్ వసికరన్ లాగా ఊహించుకోలేకపోతున్నాను.ఆ పాత్రలు మళ్ళీ రజిని గారే చేయాలి.
ఇదే విషయం శంకర్ కి, రజినికి చెప్పాను.వారు మంచివారు.నేను చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకోలేదు.2.0 కథ చాలా బలంగా ఉంటుంది.అది బ్లాక్బస్టర్ అవడం ఖాయం.భారతీయ సినీచరిత్రలో అతిపెద్ద సినిమా కాబోతోంది 2.0” అంటూ నిన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.
దాంతో బాలివుడ్ మార్కెట్ పోగొట్టుకోకూడదు, ఆమీర్ రేంజ్ హీరో దొరక్కపోతే కనీసం అక్షయ్ ని అయినా విలన్ గా పెట్టి హిందీలో హైప్ క్రియేట్ చేయాలని ఆ తరువాతా ఖిలాడి కుమార్ ని ప్రాజెక్టులోకి తీసుకొచ్చాడు శంకర్.