తాజాగా వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్ రావు గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైయస్ జగన్ తో భేటీ అయ్యారు.నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మస్తాన్ రావు.2019 ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత వైసీపీలో జాయిన్ కావడం జరిగింది.
అయితే పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఏకంగా రాజ్యసభ సభ్యత్వాన్ని బీద మస్తాన్ రావు కి కేటాయించటం పార్టీలో సంచలనంగా మారింది.ఏపీ కోటాలో బీద మస్తాన్ రావుతో పాటు.
విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి పేర్లను రాజ్యసభ సభ్యత్వానికి ఖరారు చేస్తూ వైసిపి రెండు రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది.నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక వేత్తగా మాజీ ఎమ్మెల్యే గా రాణించిన బీద మస్తాన్ రావు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.