యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్.ఇక మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ చిత్రాల తర్వాత ప్రభాస్ లవర్ బోయ్గా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్.
ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది.
రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది.
ఇక ఈ టీజర్ ద్వారా రాధే శ్యామ్ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న రాధేశ్యామ్ చిత్రం.పాన్ఇండియా స్థాయిలో రూపొందుతుండగా, ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తున్నారు.
హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో పాన్ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్.ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు.బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.సలార పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.సినిమా సంబంధించి సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.