అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించిన బిది రియల్మ్యాన్ ఛాలెంజ్ చాలా దూరం వెళ్తుందని భావించారు.టాలీవుడ్ స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని, ఈ ఛాలెంజ్ను స్వీకరించి తాము ఇంట్లో చేస్తున్న పనులకు సంబంధించిన వీడియోలను పెడతారని అనుకున్నారు.
కాని చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్లు ఛాలెంజ్ చేసిన వారు పట్టించుకోక పోవడంతో ఈ ఛాలెంజ్ ఎండ్ అయ్యింది.
ఇంటి పనులు చేసి వీడియో పోస్ట్ చేసేందుకు కొందరు నామోషిగా ఫీల్ అవుతున్నారు.
దాంతో ఈ ఛాలెంజ్ చాలా తక్కువ సమయంలోనే నీరుగారి పోయింది.ముఖ్యంగా ఎన్టీఆర్ ఛాలెంజ్ చేసిన బాలకృష్ణ, నాగార్జునలు ఈ ఛాలెంజ్ను అస్సలు పట్టించుకోలేదు.
ఆ తర్వాత చిరంజీవి ఛాలెంజ్ చేసిన రజినీకాంత్, మణిరత్నంలు ఈ ఛాలెంజ్ గురించి కనీసం ఆలోచించిన దాఖలాలు కూడా లేవు.ఇక వెంకటేష్ విసిరిన ఈ ఛాలెంజ్ను మహేష్బాబు, వరుణ్ తేజ్లు కూడా పట్టించుకోలేదు.
ఎక్కువ మంది స్టార్స్ ఈ ఛాలెంజ్ను లైట్ తీసుకోవడంతో చాలా తక్కువ రోజులకే ట్రెండ్స్ నుండి తప్పుకుంది.నాలుగు అయిదు రోజుల పాటు సోషల్ మీడియాలో రియల్ మ్యాన్ ఛాలెంజ్ తెగ వైరల్ అయ్యింది.సెలబ్రెటీలు చేసిన ఇంటి పనుల వీడియోలు వైరల్ అయ్యాయి.ఆ వీడియోలకు తోడుగా కొత్త వీడియోలు వస్తే ఈ ఛాలెంజ్ కంటిన్యూ అయ్యేది.కాని ఎవరు కూడా దీన్ని పట్టించుకోక పోవడంతో అతి తక్కువ సమయంలోనే ఇది కనుమరుగయ్యింది.