క్రికెట్ అంటే ఇష్టము లేని యువత లేదు.టీం ఇండియాలో జరిగిన వైస్ కెప్టెన్ గా ఎన్నికలో జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆనందన్ని కనబరుస్తున్నారు.
మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఫాస్ట్ బౌలర్ ను వైస్ కెప్టెన్ గా తీసుకోవడం మంచిదేనని పేర్కొన్నారు.రిషభ్ పంత్ను కాదని బుమ్రాను ఎంపిక చేయడం సులభము, అలాగే మంచి విషయము అని చెప్పారు.‘వైస్ కెప్టెన్సీకి పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సరైనవాడు.అతడు ప్రతిదానికీ కారణాలను అన్వేషించే ఆటగాడు.
అలాంటప్పుడు అతడికెందుకు రివార్డు ఇవ్వకూడదు.? ఈ నిర్ణయం నాకెంతో నచ్చింది.
చాలా ఫార్మాట్లలో బాగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ను ఎందుకు కెప్టెన్ చేయొద్దు.అని ఎమ్మెస్కే ప్రశ్నించారు.అతడిని నాయకత్వ బృందంలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని నాయకత్వ బృందంలోకి తీసుకోనంత వరకు బుమ్రా నుంచి ఏం కోరుకుంటున్నామో అతడికెలా తెలుస్తుంది.! వైస్ కెప్టెన్సీ ఒక వన్డే సిరీసుకే కాబట్టి ఇది సులభ నిర్ణయమే.
ఒకవేళ రోహిత్, రాహుల్ ఇద్దరూ లేకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’ అని ప్రసాద్ అన్నారు.
రితీందర్ సింగ్ సోధి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీకి అర్హుడని గతంలోనే చెప్పానన్నారు.‘ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్ గా చేయలేరన్నది పెద్ద అపోహ.ఫాస్ట్ బౌలర్లు ఆటను బాగా అర్థం చేసుకుంటారు.మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు కాబట్టే బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు.రాబోయే వన్డే సిరీసులో రాహుల్, బుమ్రా జట్టును ఎలా నడిపిస్తారన్నది ఆసక్తిగా ఉంది.సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే నాడు మొదలైన టెస్టులో కోహ్లీసేన అద్భుత విజయం సాధించింది.