భారత అత్యున్నతమైన క్రీడా పురస్కారం రాజేవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని టీం ఇండియా స్పిన్నర్ రవిచందన్ అశ్విన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ లకు ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించనుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించుకుంది.
కే.ఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్ లకు అర్జున అవార్డులను ప్రతిపాధించింది.ఈ విషయంపై చర్చలు జరిపామని బీసీసీఐ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఈ ఏడాదికి క్రీడా పురస్కారాల నామినేషన్లు, దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
ఈ నెల 21వ తేదీతో ముగిసిన దఖాస్తుల గడువుని మరిస్తా పెంచింది.పురస్కారల అర్హత ఉన్న క్రీడాకారులు, కోచ్ లు, ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ దరఖాస్తులను మెయిల్ చేయాలని ప్రకటలో పేర్కొంది.
ఇక లాస్ట్ ఇయర్ క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, హాకీ ప్లేయర్ రాణీ రాంపాల్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్త్ మరియప్పన్ తంగవేలుకి ఖేల్ రత్న అవార్డ్ అందించారు.లాస్ట్ టైం ఐదుగురికి ఖేల్ రత్న అందించగా ఈసారి బీసీసీఐ ఇద్దరి పేర్లను రిఫర్ చేసింది.