టోక్యో ఒలింపిక్స్ ఆరంభం నుండి మన దేశ అథ్లెట్ల ఆట తీరు అద్భుతాలను సృష్టిస్తుంది.కొందరు పోరాడి ఓడగా కొందరు స్వర్ణ, రజత, కాంస్యం పతకాలతో మెప్పిస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి భారత అథ్లెట్లు 7 పతకాలను సాధించారు.లేటెస్ట్ గా ఒలింపిక్స్ లో ఇప్పటివరకు రాని జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని తెచ్చి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు సురాజ్ చోప్రా.
ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన వారికి బీసీసీఐ భారీ నజరానాలను ప్రకటించింది.కేటగిరి వైజ్ గా స్వర్ణ పతకం గెలిచిన వారికి కోటి.
రజత పతకం గెలిచిన వారికి 50 లక్షలు.కాంస్య పతకం గెలిచిన వారికి పాతిక లక్ష్యలు నజరానా ప్రకటించారు.
ఈ లెక్క ప్రకారం బంగారు పతకాన్ని తెచ్చిన సూరజ్ చోప్రాకి కోటి.రజత పతకాలను గెలుచుకున్న మీరా భాయ్ చాను, రవి కుమార్ దహియాలకు 50 లక్షలు.
కాంస్య పతకాలను గెలుచుకున్న పివి సింధు, బోర్గొహై, బజరంగ్ పునియాలకు పాతిక లక్షలు.హాకీ టీం కు కోటి పాతిక లక్షలను ప్రకటించింది బీసీసీఐ.
ఒలింపిక్స్ లో ఎప్పుడూ చూపని విధంగా భారత అథ్లెట్ల ప్రదర్శన అలరించింది.