హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు పార్టీల నుంచి ఆ తర్వాత వ్యక్తుల మీదకు మళ్లాయి.కాగా ఇప్పుడు ఆ రాజకీయాలు కాస్తా వ్యక్తుల మీద నుంచి కులాల మీదకు మళ్లాయి.
దీంతో ఇప్పుడు నియోజక వర్గంలో మొత్తం రాజకీయాలు కులాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ ఎలాగైనా తన ఉనికిని కాపాడుకునేందుకు మరో ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది.
తనపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేతలను టార్గెట్ చేసకుని బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ఈటల రాజేందర్.దీంతో ఇప్పుడు మరో స్కెచ్ వేశారు.
అదేంటంటే ఇప్పుడు టీఆర్ ఎస్ తరఫునుంచి కౌశిక్రెడ్డి పోటీ చేస్తున్నారనే ప్రచారంతో ఎలాగైనా కౌశిక్ రెడ్డిపై తన అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నారు ఈటల రాజేందర్.ఇక మొన్న కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్లో చేరిక సందర్భంగా నియోజకవర్గం నుంచి ఆయన వర్గీయులను చాలా మందిని తెలంగాణ భవన్కు తీసుకెళ్లారు.
అయితే కేసీఆర్ చేతులు మీదుగా కండువాలు వేయించేందుకు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకు పిలిచారు.ఇక్కడే ఆయన ఓ పొరపాటు చేశారు.రెడ్డి, వెలమ నేతలను చివరకు గారు అని పిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను మాత్రం కేవలం పేరుతోనే పిలిచారు.
దీంతో ఈ వీడియోలను బీజేపీ శ్రేణులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.అయితే ఇదికూడా ఈటల రాజేందర్ ఎత్తుగడే అన్నట్టు తెలుస్తోంది.ఆయన స్కెచ్ ప్రకారమే ఇప్పుడు కౌశిక్ వీడియోను బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మార్చడంతో బీసీ వర్గాలు ఆయనపై భగ్గుమంటున్నారు.
ఇప్పుడు బీసీ వర్గాలు కౌశిక్ రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అవుతుండటంతో ఆయన ఏకంగా బీసీ వర్గాల వ్యతిరేకిగా మారిపోయారు.మొత్తానికి ఈటల రాజేందర్ వేసిన ఎత్తుగడ బాగానే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.