ప్రపంచంలోని మొత్తం దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ మంత్రాన్ని జపిస్తున్నాయి.అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ని కూడా విధించారు.
దీనివల్ల లాక్ డౌన్ విధించిన దేశాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ మహమ్మారి చైనా దేశంలోని వ్యూహాన్ నగరంలో మొట్టమొదటిసారిగా కనిపించింది.
దీంతో అప్రమత్తమైనటువంటి చైనా ప్రభుత్వ అధికారులు ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.అయితే ఇందులో ముందుగా ఈ కరోనా వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో కొంతకాలం పాటు గబ్బిలాలు మాంస విక్రయాలను నిలిపివేశారు.
అయితే ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ ని నియంత్రిస్తుండడంతో మళ్లీ గబ్బిలం మాంస విక్రయాలను మొదలు పెడుతున్నారు.దీంతో పలువురు ఈ గబ్బిలం మాంసం విక్రయాలపై అభ్యంతరం తెలుపుతున్నారు.
అలాగే కొంత కాలం పాటూ ఈ మాంస విక్రయాలను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి కొందరు సూచిస్తున్నారు.అయినప్పటికీ మాంస విక్రయదారులు మాత్రం వినకుండా మాంస విక్రయాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు.
దీంతో చైనా పక్కన ఉన్నటువంటి దేశాలు మళ్లీ భయపడుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ కారణంగా మృతి చెందినటువంటి మృతుల సంఖ్య విషయంలో చైనా తెలిపినటువంటి అధికారిక లెక్కలను మరికొందరు తప్పుబడుతున్నారు.
ఏదేమైనప్పటికీ చైనా లో పుట్టినటువంటి ఓ వైరస్ ప్రపంచ దేశాలను ఇంతగా కలవరపెడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.