అడవులలో ఉండే కొండచిలువలు, అనకొండలు జంతువులని మింగేస్తూ ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే.ఎలాంటి జంతువునైన చాలా సులభంగా ఒడిసిపట్టుకొని మొత్తం చుట్టేసి మెల్లగా మింగేస్తుంది.
తరువాత ఈ చెట్టుకో చుట్టుకొని మింగేసిన జంతువుని అరిగించేసుకుంటుంది.మనుషులని కూడా కొన్ని కొండచిలువ జాతులు మింగేసిన ఘటనలు కొన్ని చోట్ల చూసిన సంగతి తెలిసిందే.
అయితే కొండచిలువ జాతికి చెందిన ఓ పాము ఏకే 47 మింగినట్లు కనిపిస్తోంది.
దీనికి సంబందించినఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ ఏకే 47 ఎలా మింగిందో అనేది మాత్రం అర్ధకాని విషయంగా ఉంది.నైజీరియాలోని చాడ్ బేసిన్ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ పాము ఏకే 47 తుపాకిని మింగిననట్లు తెలుస్తుంది.
సమాచారం.మొత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాముని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి తుపాకిని మింగేసిన ఈ పాముకి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.