టీఆర్పీ రేటింగ్స్ పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది.వచ్చే 12 వారాల పాటు న్యూస్ ఛానెళ్ల వ్యూయర్ షిప్ రేటింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ.
బార్క్ నిర్ణయం తీసుకుంది. హిందీ, ఇంగ్లీష్,బిజినెస్ న్యూస్ ఛానల్ తో పాటు.
ప్రాంతీయ భాషా వార్థా ఛానెళ్ల పై తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ఈ 12 వారాల నిర్ణీత గడువులో అన్ని ఛానళ్లకు సంబంధించిన వీక్లీ రేటింగ్స్ ను బార్క్ పబ్లిష్ చేయదు.
అయితే రాష్ట్రాలు, భాషల వారీగా న్యూస్ జనరేషన్ కు సంబంధించి ఆడియన్స్ ఎస్టిమేషన్ ను మాత్రం రిలీజ్ చేయనుంది. చానల్స్ కు రేటింగ్ ఇవ్వడం, అవసరమైన మార్పులను సూచించేందుకు.
బార్క్ టెక్నికల్ కమిటీని నియమించింది.రాబోయే 8 నుండి 12 వారాల పాటు ఈ కమిటీ ప్రస్తుత స్టాండర్స్, స్టాటిస్టికల్ డేటా ను పరిశీలించి, కావలసిన సూచనలు, విధి విధానాలు బార్క్ కు తెలియజేయనుంది.