తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపుతో మారిన బ్యాంకుల పనివేళలు.. !

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల పని వేళల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.కాగా ఇది వరకు లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా, బ్యాంకులు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.

 Banks Working Hour Changed With Lockdown Extension In Telangana Telangana, Bank-TeluguStop.com

కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ, లాక్‌డౌన్ సమయాన్ని కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు.దీంతో వర్తక వ్యాపారాల్లో, ఇతర కార్యకలాపాల్లో కూడా పలు మార్పులు చోటు చేసుకోగా, రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మార్చబడ్దాయి.

ఈ నేపధ్యంలో ఇక నుండి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పేర్కొంది ఇక ఈ నిర్ణయంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారట.లేదంటే సమయం సరిపోక పోవడంతో రోడ్ల పైన ఆ నాలుగు గంటలు రద్దీ ఎక్కువగా ఉండేది.

ప్రభుత్వ నిర్ణయంతో ఆ రద్దీ కాస్త తగ్గిందట

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube