ఓ మహిళ బ్యాంకులో పని చేస్తున్నాను అంటూ ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా 11 లక్షల రూపాయలు దోచుకుంది.ఈ సంఘటన తెలంగాణలో నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగింది.
ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… సదరు మహిళ ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఓ బ్యాంకులో పని చేస్తున్నా అంటూ మెసేజ్ పంపుతూ ఆయనతో పరిచయం పెంచుకుంది.ఈ పరిచయంతో చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మణ్ రావు తన పూర్తి వివరాలను ఆమెకు తెలియజేశాడు.
దీంతో ఓ రోజు తాను పనిచేసే బ్యాంకులో వ్యక్తి మరణించాడని అతని బ్యాంకు అకౌంట్ లో ఉండే 9600 మిలియన్ డాలర్లను డ్రా చేసుకునేందుకు సహకరించాలని లక్ష్మణ్ రావు ని ఆవిడ కోరింది.దీని పక్షంలో ఆ విషయాన్ని ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు.
అయితే ఇందుకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు వారి బ్యాంకు లోనే అకౌంట్ ఓపెన్ చేయాలని, అందుకోసం 96 వేల రూపాయలను పంపాలని కోరింది.ఇలా ఆ తర్వాత కొన్ని దఫాలు లక్ష్మణ్ రావు నుండి ఆ మహిళకు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు పంపించాడు.
ఇదిలా ఉంటే మరోవైపు మార్చి నెల లో మరో మహిళ లండన్ లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి ఇండియాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావిస్తున్నట్లు ఆయనతో చాటింగ్ చేసింది.అయితే ఈ వ్యాపార క్రమంలో లక్ష్మణ్ రావు తనకు ఐదు లక్షలు తనకి డబ్బులు పంపమని ఆడగా ఆ మహిళ డబ్బులు పంపిస్తానని, అయితే బ్యాంకు ఖాతా ద్వారా పంపితే ఇబ్బందులు వస్తాయని తెలిపింది.
అయితే అందుకు సంబంధించిన కస్టమ్ చార్జీలు చెల్లించమని ఆమె తెలిపింది.దీనితో సరే అన్న ఆ వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్ ఆఫీసర్స్ నుంచి ఫోన్ వచ్చినట్లు నమ్మించి మొదటగా రూ.40 వేల రూపాయలు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పార్సల్ మీ ఇంటికి వస్తుంది అని నమ్మించారు.
ఆ తర్వాత మళ్లీ పార్సల్ రాకపోయేసరికి మళ్లీ ఫోన్ చేసి అడగగా అందులో విలువైన ఆభరణాలు ఉన్నాయని అందుకోసం మరో మూడు లక్షల రూపాయలు పంపిస్తే పార్సల్ మీ వద్దకు వస్తుందని, లేకపోతే ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పడంతో… ఆ డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారు.ఇక అంతే ఆ తర్వాత సదరు మహిళకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.తాను మోసపోయానని గ్రహించిన లక్ష్మణ్ రావు ఏకంగా 11 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.దీంతో పోలీసు అధికారులకు పూర్తి విషయాన్ని తెలిపారు.