దేశంలో ఒక వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంది.మరో వైపు వ్యాక్సిన్ పక్రియ రెండో దశ సిద్దం అవుతుంది.
అంతే కాకుండా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు టీకాలు వేయాలని నిర్ణయించడం కూడా జరిగిందట.
ఈ క్రమంలో కరోనా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.
ఇకపోతే ప్రస్తుతం కోవిన్ యాప్లో పేర్లు నమోదైన వారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే.అయితే దానిలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
కోవిన్ యాప్తో సమస్యలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం సెకండ్ వెర్షన్ను అందుబాటులోకి తెస్తోంది.అది ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుందని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
దీంతో లబ్ధిదారులు నేరుగా వచ్చి టీకా వేసుకోవడంతో పాటు, ముందస్తుగానూ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.ఇదిలా ఉండగా ఎన్టీపీసీ లో ఓ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్ సోకడంతో బ్యాంక్ బంద్ పెట్టి కరోనా పరీక్షలకు బ్యాంకు సిబ్బంది వెళ్ళినట్లు సమాచారం.
ఇక పూర్తి వివరాలు తెలియరాలేదు.