వైరల్: స్థల వివాదంలో ఎమ్మెల్యే దానం బెదిరింపులు

ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలీ వివాదస్పదమైంది.ఎమ్మెల్యే దానం నాగేందర్ తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

 Bank Employee, Mla Dhanam Nagender, Hyderabad, Trs Leaders,-TeluguStop.com

ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.2010 ఖైరతాబాద్‎లోని ఖాళీ ప్రదేశం మీద కావూరు సాంబశివరావు అనే వ్యక్తి లోన్ తీసుకున్నారు.సదరు వ్యక్తి డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు.

బహిరంగ వేలంలో ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి బ్యాంక్ కేటాయించింది.అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్.ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా వేలానికి ఎలా పెడతారంటూ బ్యాంకు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు.

స్థలం తమకే కేటాయించే విధంగా చర్యలు తీసుకొని బ్యాంకు అధికారులను బెదిరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలిపారు.

ఎమ్మెల్యే అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube