చాలా మందికి వంటలంటే ఇష్టం.తమకు నచ్చిన ఫుడ్ ను తినడానికి కొంతమంది ఎంత దూరమైనా వెళ్తారు.
ఇంకొంత మంది అమ్మచేతి వంటలు తింటూ ఆనందంగా ఉంటారు.వంటలను ఇష్టపడేవారిలో శాకాహారులు ఉంటారు అలాగే మాంసాహారులు ఉంటారు.
వీరిలో ఎవ్వరికైనా సరే ఉదయం వేళ వేడి వేడి టిఫిన్ తినడం అంటే ఇష్టం.అందులోనూ ఇడ్లీ సాంబార్ తినేవాళ్లు చాలా మందే ఉంటారు.
దేశవ్యాప్తంగా ఇడ్లీ అంటే ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు.అందుకోసమే వివిధ రెస్టారెంట్లు, హోటల్లు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాలుగా ఇడ్లీలను చేస్తూ వారిని ఆకట్టుకుంటూ ఉంటారు.
టిఫిన్ లలో ఎన్నో వెరైటీలు ఉన్నప్పటికీ కూడా అందులో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి.దేశవ్యాప్తంగా ఇడ్లీలను గుడ్రంగానే చేయడం పద్దతి.
అయితే ఓ రెస్టారెంట్లో మాత్రం ఇడ్లీలను వినూత్నంగా చేస్తున్నారు.
ఈ ఇడ్లీలు అందరూ చేసినట్లుగానే గుండ్రంగానే చేయకుండా ఆ రెస్టారెంట్ వాళ్లు కొంచెం కొత్తగా చేశారు.
ప్రస్తుతం ఆ ఇడ్లీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఇడ్లీలను చూసిన నెటిజన్లు అద్బుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.దేశంలోనే మహానగరంగా బెంగుళూరు ప్రసిద్దికెక్కింది.చాలా మంది ఉద్యోగాలు చేయడానికి బెంగుళూరు బాట పడుతుంటారు.
అటువంటి బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ లో ఇడ్లీలను కొంచెం డిఫరెంట్ గా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
బెంగళూరుకు చెందిన రెస్టాంట్ సిబ్బంది ఇడ్లీలను ఐస్ క్రీమ్ ఆకారంలో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఆ ఇడ్లీలకు ఐస్ క్రీం పుల్లలు కూడా ఉంటాయి.ఇడ్లీ పిండికి వారు తయారు చేసే సమయంలో ఐస్ క్రీమ్ పుల్లను పెట్టి పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీలను తయారు చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఇటువంటి వెరైటీ ఇడ్లీలను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.రెస్టారెంట్ నిర్వాహకుల క్రియేటివిటీకి హాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.