ప్రస్తుతం సమాజం ఎంతలా మారిందో చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే ఎంతోమంది స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి.
జరుగుతూనే ఉన్నాయి.అంతేకాకుండా బెదిరింపులతో కూడా లొంగ తీసుకుంటున్నారు.
కానీ ఇప్పటికీ వీటి విషయంలో సరైన న్యాయం దొరకటం లేదు.సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు కూడా ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ పై కూడా అత్యాచారయత్నం జరిగింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.
బంగ్లాదేశ్ కు చెందిన హీరోయిన్ స్మిరిటీ శామ్ సున్నాహార్.ఈమెను మరో పేరు పోరీమోని అని కూడా పిలుస్తారు.నటిగానే కాకుండా మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2013లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అతి తక్కువ సమయంలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.వెండితెరపై కాకుండా బుల్లితెర లో కూడా తనేంటో నిరూపించింది.
ఇదిలా ఉంటే ఇటీవలే తనపై అత్యాచారయత్నం జరిగిందని తెలిపింది.4 రోజుల క్రితం తను ఓ క్లబ్ లో ఉండగా అక్కడ బడా వ్యాపారవేత్త నజీర్ యు మహమ్మద్ తనపై అత్యాచారానికి యత్నించడంతో పాటు చంపుతామని బెదిరించడాట.దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అతడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.అంతేకాకుండా వారు మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని తెలిపారు.
ఇక తాజాగా ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.దేశ ప్రధాని షేక్ హసీనా కు ఈ ఆపద నుంచి కాపాడమని కోరింది.
న్యాయం కోసం ఎక్కడ వెతకాలి అంటూ నాలుగు రోజులుగా న్యాయం కోసం తిరుగుతున్నానని తెలిపింది.కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ తన బాధను పంచుకుంది.తను ఓ అమ్మాయి, నటి కంటే ముందు మనిషినని ఇక సైలెంటుగా ఉండలేనని తెలిపింది.