ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు సృష్టిస్తున్న నరమేధం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.చాలా వరకు దేశం తాలిబాన్ల చేతిలోకి వెళ్లిపోవడంతో… అక్కడి జనాలు భయభ్రాంతులకు గురి అవుతూ… దేశ సరిహద్దులు దాటి పారిపోతున్నారు.
ఇటువంటి తరుణంలో కొన్ని విద్రోహ శక్తులు ఆయా దేశాలలో తాలిబాన్ల సానుభూతిపరులు.మేల్కొంటున్నాయి.
బంగ్లాదేశ్ నుండి భారత్ గుండా ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఆఫ్గనిస్తాన్ చుట్టుప్రక్కల దేశాలలో కలవరం స్టార్ట్ అయింది.ఏ వైపు నుండి ఏ ముప్పు వస్తుందో అర్థం కాని పరిస్థితి.ఇప్పటికే పాకిస్థాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల అన్ని తాలిబన్లతో జత కట్టాయి.
ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొన్ని విద్రోహ శక్తులు భారత్ గుండా వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని తాలిబన్లతో కలిసి పని చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇటీవల ఓ పోలీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రకటనతో భారత్-బంగ్లా సరిహద్దుల వద్ద రెడ్డి పహారా కాస్తున్నారు అధికారులు.
ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు సృష్టిస్తున్న విధ్వంసం.
తో పాటు వారితో విద్రోహ శక్తులు చేరాలని అనుకోవడం చుట్టుప్రక్కల దేశాలకు వణుకు పుట్టిస్తోంది.