దేశం కానీ దేశంలో ఓ భారతీయ యువతికి పెద్ద కష్టం ఎదురైంది.ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసిన ఓ ముఠా అనంతరం ఆ యువతిని కిడ్నాప్ చేసి, మతమార్పిడితో బంగ్లాదేశ్కు తరలించింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలకం రేపుతోంది.వివరాల్లోకి వెళితే.
చెన్నైలోని సంపన్న కుటుంబానికి చెందిన యువతి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది.ఆ యువతి ఆస్తిపై కన్నేసిన ఓ ముఠా ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి మత మార్పిడి చేసి బలవంతంగా బంగ్లాదేశ్ తరలించింది.
నజీష్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు.అతనికి తండ్రి షౌకత్ హుస్సేన్, స్నేహితులు మానిష్ మాలిక్, నవాజ్లతో పాటు మరికొందరు సహకరించారు.తమ కుమార్తె మతమార్పిడితో బంగ్లాదేశ్కు తరలించబడ్డట్టుగా చెన్నైలోని తల్లిదండ్రులకు సమాచారం అందింది.ఆ యువతిని కిడ్నాప్ చేయాలనే లక్ష్యంతోనే ఆ యువకుడు, అతడి తండ్రి, స్నేహితులతో పాటు ముంబై పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న జకీర్ నాయక్ ప్రేమ నాటకం ఆడినట్లుగా తెలుస్తోంది.
బాధిత యువతిని కిడ్నాప్ చేసిన ఆ ముఠా విడుదల చేయడానికి కొన్ని కోట్లను డిమాండ్ చేసినట్లు సమాచారం.అయితే సంపన్న కుటుంబం కావడంతో తన పలుకుబడితో వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలోకి ఆ యువతి తండ్రి తీసుకెళ్లాడు.దీంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ రంగంలోకి దించింది.యువతి కిడ్నాప్ విషయంగా ఎన్ఐఏ తన విచారణలో దూకుడు పెంచింది.అయితే, తమ బిడ్డ సురక్షితంగా చెన్నైకి రావాలని ఆ కుటుంబం ప్రార్థనలు చేస్తోంది.ఈ కుటుంబం పూర్వీకులది ఉత్తరాది అయినప్పటికీ, కొన్నేళ్ల క్రితం చెన్నైలో స్థిరపడింది.