ప్రపంచ వ్యాప్తంగా పలు ఎన్జీవోలు మరియు ప్రభుత్వాలు తమ దేశంలో వ్యభిచార గృహాలను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటుంటే ఆ దేశంలో మాత్రం ప్రభుత్వమే వ్యభిచారాన్ని లీగల్ చేసింది.దీంతో అక్కడ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి వేశ్యలు దొరుకుతారట.
ఇప్పుడు అలాంటి దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఒకటి.
అయితే ఈ దేశంలో ఇటీవలే వ్యభిచారాన్ని చట్ట బద్ధం చేశారు.అంతే కాకుండా ఇందులో ప్రభుత్వ నిబంధనలకు లోబడి మహిళలు ఎవరైనా వ్యభిచారం చేసుకోవచ్చని అనుమతులు కూడా ఇచ్చారు.
దీంతో ఈ దేశంలోని “దౌలాటిదియ” ప్రాంతంలో దాదాపుగా రెండు వేల మంది కి పైగా మహిళలు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు.అయితే ఇక్కడ పది రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వేశ్యలు దొరుకుతారు.
ఇటీవలే ఈ వ్యభిచారాన్ని లీగలైజ్ చేయడంతో మరింతమంది యువతులు డబ్బు కోసం వ్యభిచారం చేయడానికి ముందుకు వస్తున్నారట.దీంతో ప్రపంచ దేశాలు ఈ వ్యభిచారం లీగలైజ్ చేయడం విషయంపై బంగ్లాదేశ్ తో చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి.
అంతేకాక కొందరు ఎన్జీవో సంస్థల అధికారులు ఈ వ్యభిచారాన్ని రూపుమాపడానికి నిధులు కూడా సమకూర్చినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేక పోయింది.
దీంతో కనీసం ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యభిచార గృహాలలో మూసివేయాలని కొందరు సోషలిస్టులు కోరుతున్నారు.ఈ వ్యభిచార గృహాల వల్ల ఎంతో మంది యువతులు జీవితాలు నాశనం చేసుకోవడమేగాక యువత కూడా తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.మరి కొందరు మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతవుతుందని దాంతో నిధులు సమకూర్చుకునేందుకు ఇలాంటి పనులు చేస్తుందని కోణదృ కామెంట్లు చేస్తున్నారు.