టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీగా ‘సోగ్గాడే చిన్నినాయన’ నిలవడంతో ఆ సినిమాకు సీక్వెల్గా రాబోతున్న ‘బంగార్రాజు’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఇక ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ, ఎట్టకేలకు ఇటీవల షూటింగ్ మొదలుపెట్టుకుంది.దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాగ్తో పాటు చిత్ర యూనిట్ కూడా భావిస్తోంది.
అయితే ఈ సినిమాలో నాగార్జునతో పాటు అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ను ముగించుకోగా, ప్రస్తుతం మైసూర్లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్లో చైతూ, రమ్యకృష్ణలపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.కాగా ఈ సినిమాలో నాగ్ పాత్రతో పాటు చైతూ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ కాంబో ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
మొత్తానికి షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టినా, బంగార్రాజు ప్రస్తుతం దూకుడును చూపిస్తుండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఈ సినిమాను నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.
మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.