నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెల్సిందే.సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలు పెట్టారు.
జెట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఈ సినిమాను పూర్తి చేసేందుకు జోరుగా షూటింగ్ చేస్తున్నారు.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అవ్వడం వల్ల ఖచ్చితంగా సినిమా కు మంచి ఓపెనింగ్స్ దక్కడం ఖాయం.
అందుకే నమ్మకంతో సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే నాగార్జున లుక్ ను రివీల్ చేయడం జరిగింది.
తాజాగా లేడీస్ ఫస్ట్ అంటూ నాగలక్ష్మి వచ్చింది.నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె పాత్ర పేరు నాగలక్ష్మి.సినిమాలో ఆమె గ్రామ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఉప్పెన సినిమా తో టాలీవుడ్ దృష్టిన ఆకర్షించి టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగమ్మ కృతి శెట్టి ఈ సినిమా తో మరింత గా పాపులారిటీని దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందని నాగార్జున అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ కోసం పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో లో స్వర్గం సెట్ ను వేయడం జరిగింది.అందులో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.నాగలక్ష్మి పాత్రను ఈ సినిమా లో చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లుగా ఈ పోస్టర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను మీడియా వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పెన జోరును బంగార్రాజు తో కృతి శెట్టి కొనసాగిస్తుందా అనేది చూడాలి.